By Village Missionary Movement
Tuesday, 14-Mar-2023దిన ధ్యానము(Telugu) 14.03.2023
అంశం: యేసు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది
"మన యతిక్రమక్రియలనుబట్టి అతడు గాయపరచ బడెను మన దోషములనుబట్టి నలుగగొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతనిమీద పడెను అతడు పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలుగు చున్నది" - యెషయా 53:5
ఆరోజు ఈస్టర్ ఆదివారం. ఒక బోధకుడు పాతబడిన చిలుక పంజరమును మందిరమునకు తీసుకొని వచ్చి పులి పీఠం పైన పెట్టారు. చర్చిలో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రశ్నార్ధకముగా చూస్తూ ఉన్నారు. వారిని చూసిన వెంటనే బోధకుడు మాట్లాడడం మొదలుపెట్టారు. నేను చర్చికి వస్తున్నప్పుడు ఒక చిన్న బాబు ఈ చిలకపంజరాన్ని పట్టుకొని వచ్చాడు. ఆ పంజరంలో మూడు చిలుకలు భయపడుతూ ఉండుటను చూశాను. అక్కడ ఏముంది అని ఆ చిన్న బాబుని అడిగాను ఆ మూడు ముసలి చిలుకలు అని బదులిచ్చాడు. వీటితో ఏం చేస్తావు అని అడిగినప్పుడు తను నవ్వుతూ వీటిని ఇంటికి తీసుకుని వెళ్లి ఆడుకుంటాను. వాటి రెక్కలను ఊడదీసి వాటి మధ్య గొడవ పెట్టి అవి గొడవ పడుతూ ఉంటే నేను వాటిని చూస్తాను. చివరగా వాటిని నేను పెంచుతున్న పిల్లికి ఆహారంగా వేస్తాను అని అన్నాడు. కుమారుడా వీటిని నాకు డబ్బులకు ఇస్తావా అని అడిగాను. అందుకు ఆ బాబు ఇవి సాధారణ చిలుకలు ఇవి పాడవు పైగా ఇది అందంగా కూడా లేవు అని అన్నాడు. అందుకు నేను వాడితో నువ్వు ధర మాత్రమే చెప్పు అని అన్నాను. అందుకు ఆ బాబు 100 రూపాయలు అని చెప్పాడు. నేను వాటిని కొని ఆ పంజరంతో పాటు పట్టుకుని వస్తూ ఉన్నాను. ఆ చిన్న బాలుడు డబ్బులు తీసుకుని వెళ్లిపోయాడు. నేను చర్చి దగ్గర ఉన్న చెట్టు పైకి ఆ మూడు చిలుకలను ఎగరన నిచ్చాను అని చెప్పి ప్రసంగమును మొదలుపెట్టారు.
ఒకరోజు ఏదేను తోటలో నుండి వచ్చినా సాతాను మరియు యేసుక్రీస్తు ప్రభువు మాట్లాడుతూ ఉన్నారు. యేసయ్య నేను ప్రపంచం అంతటినీ నా స్వాధీనంలోనికి తీసుకున్నాను. ఎవరు నన్ను ఎదిరించ లేరు. చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరిని పట్టుకున్నాను అని అహంకారంతో అన్నాడు సాతాను. యేసయ్య మృదువైన స్వరముతో వారితో ఏం చేస్తావో అని అడిగారు. ఓహో అదా నేను వారికి ఎలా గొడవపడాలో ఎలాగ మద్యం తాగాలో నేర్పిస్తాను అన్నాడు. అప్పుడు యేసయ్య చాలా వేదనతో సాతాను వైపు చూస్తూ తరువాత ఏం చేస్తావు అని అడిగాడు. అందుకు సాతాను వారిని ఆత్మహత్యకు నేరుగా నడిపిస్తాను అన్నాడు. అందుకు యేసయ్య క్రయధనముగా నేను నీకు ఏమి ఇస్తే వీరిని నాకు ఇస్తావు అని అడిగారు. వెంటనే సాతాను అయ్యా వీరు మీకు వద్దు వీరు మంచివారు కాదు వీరు నీ మొఖము పైన ఉమ్మె వేస్తారు మిమ్మును శపించి గాయపరిచి సిలువలో వేలాడదీస్తారు అని చెప్పాడు. ఈ మాటలన్నీ వినకుండా యేసయ్య సాతాను తో నీకు ఎంత కావాలి అనేది మాత్రమే చెప్పు అని అన్నారు. సాతాను యేసయ్య వైపు హేళనగా చూస్తూ అయ్యా వీరికి క్రయధనముగా మీ కన్నీరు అంతటినీ మీ శరీరంలో ఉన్న రక్తం అంతటినీ ఇవ్వమని అన్నాడు. ఖాళీగా ఉన్న పంజరాన్ని ఆ సంఘంలో ఉన్న వారందరికీ చూపించి ప్రార్థించడం మొదలు మొదలుపెట్టారు బోధకుడు. సిలువలో కార్చిన రక్తం ద్వారా దేవుడు క్రయ దనమును చెల్లించి మనలను కొన్నారు. అపవాది సంకెళ్ల నుండి మనలను విడిపిస్తున్నారు మనము వీటిని గ్రహిస్తున్నామా? హల్లెలూయ!
- బ్రదర్. భాగ్యనాథన్ గారు
ప్రార్థన అంశం:
ఆమెన్ విలేజ్ టీవీ కొరకైనా అవసరతలు యేసు నామములో సందింపబడేలా ప్రార్థిద్దాం
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
www.vmm.org.in
ఈమెయిల్: info@vmm.org.in
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250