Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 15.11.2024 (Gospel Special)
Share:

By Village Missionary Movement

Friday, 15-Nov-2024

దిన ధ్యానము(Telugu) 15.11.2024 (Gospel Special)

 

అంశం: యేసుక్రీస్తుకు అంకితమైన బీజం 

 

"మరియుమీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి" - మార్కు 16:15

 

యేసు తాను లేచిన తరువాత, తన శిష్యులకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం, ఆయన శిష్యులు యేసు గురించి, పశ్చాత్తాపం మరియు దేవుని రాజ్యం గురించి ప్రకటించడం ప్రారంభించారు. దీనివల్ల అనేక మంది రక్షించబడ్డారు. వారిలో చాలామంది బాధలను అనుభవించడానికి చెరసాలకు వెళ్ళుటకు మరియు మరణాన్ని కూడా అంగీకరించారు . పేతురు, స్టీఫెన్, తోమస్, పౌలు మరియు మరెన్నో పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ఇంకా అనేకమంది భారతదేశానికి, తమిళనాడుకు వచ్చి యేసు గురించి ప్రచారం చేసారు. వారు వచ్చి ఉండకపోతే, మనం రక్షణ పొందలేము.

 

1815వ సంవత్సరంలో ఇంగ్లండ్‌లో ఒక క్రైస్తవ కుటుంబంలో జన్మించి, క్యాంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో అద్భుతమైన విద్యార్థిగా పట్టభద్రత పొందిన, 26వ ఏట సహాయ అధ్యాపకుడిగా పునరుత్థాన దివ్య సందేశాన్ని ప్రసారం చేసినవారు, కణం థామస్ రెక్లాండ్. ఈయన, శివకాశిలో బాణాసంచా తయారు చేసే ప్రాంతంలో క్రైస్తవ సువార్త కాంతిని పరిచయం చేసిన వ్యక్తి. ఒకసారి CMS దక్షిణ భారతదేశ కార్యదర్శిగా పనిచేస్తున్నప్పుడు, ఆయన కన్యాకుమారి జిల్లాలో చూసిన దృశ్యం ఆయనను బాధ పెట్టింది. ఒక ఒక నాగలితో పొలము దున్నుటకు ఒకవైపు ఎద్దు కట్టబడి ఉంది మరొకవైపు సమాజంలో తక్కువ కులము గలిగిన ఒక మహిళ కట్టబడి ఉండుట చూసి, ఆ దుఃఖానికి వ్యతిరేకంగా మొదటి సారిగా స్వరం ఎత్తారు. పేదలపట్ల చాలా ప్రేమతో, క్రీస్తు ప్రేమను పంచేందుకు ఆయన తనను అంకితం చేసుకుని పనిచేశారు. ఒక గ్రామానికి వెళ్లినప్పుడు నీళ్ల బావి దగ్గర నీళ్లు తాగుటకు ఆయనను అనుమతించలేదు. "క్రైస్తవులకు నీరు లేదు" అన్న కారణంతో, ఒక చిన్న అబ్బాయి కొన్ని పశువుల పాలను ఇచ్చి ఆయనకు తాగునీరు అందించాడు. తన పదవిని పక్కన పెట్టి, ప్రజలతో ప్రజలుగా జీవించమని నిర్ణయించుకున్నాడు. ప్రతి గ్రామానికి వెళ్లి సువార్తను ప్రకటించాడు. ప్రభు కుటుంబంలో పుట్టిన ఈయన ఒక రోజు తన టోపీలో ఒక మహిళ అందించే బెల్లం పాకం తాగి జీవించి తన్ను తాను తగ్గించుకొని పరిచర్య చేశారు. ఈయన శ్రీవిల్లిపుత్తూర్, రాజపాలయం, విరుద్ నగర్, ఈంజార్, ఇజహాఇరాపాణం అనే పన్నెండు ప్రాంతాలలో 25 చర్చిలను ఏర్పాటు చేసినవారు. ఎంతో తక్కువ సమయములో వ్యాధితో బాధపడుతూ, 1858వ సంవత్సరంలో అక్టోబరు 22న, 43 సంవత్సరాల వయస్సులో దేవుని రాజ్యంలో చేరాడు. ప్రభువుల సమాధి వద్ద సమాధి చేయబడవలసిన ఆయన తన పరిచర్య చేసిన ప్రాంతంలో ఒక చింత చెట్టు కింద సమాధి చేయబడ్డాడు.

 

అలాగే అతను చేసిన అంకితమైన పని మాదిరిగా ఇవాళ కూడా మనకు అవసరమయ్యే వారు, సువార్తను ప్రకటించడంలో అవసరమైన వారే. యేసు ప్రేమ, పరిమళమైన మనసు, మర్యాదలతో కూడిన క్రీస్తు ప్రేమను పంచేందుకు తాము అంకితమై, గ్రామాల మధ్య సువార్తను వెల్లడించండి. "అంతటా సువార్త ప్రకటించబడాలి అనేది" జ్ఞాపకం ఉంచుకొని, దేవుని రాజ్యంలో భాగం కావాలని మనం మరింత విధేయతతో పని చేద్దాం. ఆసమయంలో మనసు అంకితమవ్వాలని ప్రార్థిద్దాం. ఆమేన్.

- శ్రీమతి. భువనా ధనపాల్ గారు

 

ప్రార్థన అంశం:-

అన్ని మండలాల్లో ప్రార్థించే గుంపులు లేచేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet padişahbet bets10 extrabet royalbet süperbetin padişahbet betcio royalbet casinoroyal queenbet bahiscasino betcio bahiscasino atlasbet padişahbet betpas bahiscasino celtabet queenbet casibom jojobet jojobet casibom holiganbet restbet safirbet