By Village Missionary Movement
Tuesday, 27-Aug-2024దిన ధ్యానము(Telugu) 27.08.2024
అంశం: ప్రకటించుడి
"ఆయన వానికి సెలవియ్యకనీవు నీ యింటివారియొద్దకు వెళ్లి, ప్రభువు నీయందు కనికరపడి, నీకు చేసిన కార్యములన్నిటిని వారికి తెలియజెప్పుమనెను" - మార్కు 5:19
ఒక కాపలా ఉన్నతాధికారి చేతిలో జారిపోయిన పాప అని సువార్త కరపత్రికి ఒకటి దొరికింది దాంట్లో దేవుడు తన ఏకైక కుమారుడిని లోకానికి ఇచ్చిన అద్భుత సందేశము రాయబడి ఉంది. కానీ దానిని హేళనగా చూచి ఆ అధికారి వాడుకు చొప్పున దాని నలిపి చెత్తబుట్టలో పడేసాడు. ఆ దినము సాయంకాలము ఆయన తన ఇంటిలో 2 సంవత్సరాల వయసు గల పాపను ముద్దాడుతూ ఆడిపిస్తున్నారు. ఆ మేడ చివరి భాగంలో నిలబడి ఉన్న ఆయన చేతిలో ఉన్న ఆ పాప గెంతింది. వెంటనే ఆయన బలమైన చేతిలోనుండి జారిపోయింది. వెంటనే ఆయన ఆ పాపను కాపాడుటకు మేడ నుండి కిందకు దూకారు. పోలీసు తర్ఫీదు ఉండడం వలన ఆ పాపను జాగ్రత్తగా పట్టుకున్నారు. తాను కింద పడినప్పటికీ ఆ పాప కింద పడకుండా పట్టుకున్నారు. ఆ పాపకు ఎలాంటి గాయము తగలేదు కానీ ఆయనకైతే ఎడమ చేయి మరియు కాలు ఫ్రాక్చర్ అయింది. హాస్పిటల్ చేర్చబడ్డారు. ఆ దిన సాయంకాలము కొంతమంది సహోదరులు హాస్పిటల్ పరిచర్య చేయడానికి వచ్చారు. ఆ అధికారి చేతిలో జారిపోయిన పాప అని అదే కరపత్రికను మరల ఇచ్చి సువార్త ప్రకటించి వెళ్లారు. ఇప్పుడు ఆయన చేతిలో గల కరపత్రిక నిజాన్ని ప్రకటించింది. చెడ్డవాడ నైనా నేనే ఆ కుమార్తె కొరకు ఇంతగా చేసినప్పుడు పరిశుద్ధమైన దేవుడు పాపులమైన మన కొరకు ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని ఇచ్చి ఉండడం ఖచ్చితముగా నిజమే అని మనసులో తలంచారు. ఆ దినమే రక్షణ పొందారు.
కొత్త నిబంధనలో మార్కు రాసిన సువార్తలో దయ్యము పట్టిన ఒక వ్యక్తిని మనం ఎరుగుదము. ఆయనను కట్టడి చేయుట ఎవరి వలన కాలేదు. ఆయన యేసయ్యను నమస్కరించిన తర్వాత యేసయ్య ఆయనలో ఉండిన అపవిత్ర ఆత్మను గద్దించి ఆ మనిషిని స్వస్థపరిచారు. యేసు ఆ మనుషులతో నీవు నీ బంధువుల వద్దకు వెళ్లి దేవుడు నీ కొరకు చేసిన కార్యాన్ని నీ వారికి ప్రకటించుము అని అన్నారు.
నా ప్రియమైన వారలారా! ఈ దయ్యము పట్టిన మనిషిని వలె మనం ప్రతిరోజు ఏదో ఒక రోగం వలన లేదా యేసయ్యకు దూరంగా లేక యేసయ్య లేకుండా జీవిస్తూ ఉండవచ్చు కానీ ఎవరో ఒకరు యేసయ్య గురించి మనకు చెప్పారు. మనం తెలుసుకున్నాం కారణం వారు మనకు యేసయ్యను ప్రకటించినందువలననే ఆ కాపుల అధికారికి మరలా మరలా సువార్త చెప్పబడింది. ఫలితం ఆయన రక్షింపబడ్డాడు. ప్రభువు మన యొక్క జీవితంలో మరలా మరలా మేలు చేస్తూ దీవించి ఉండడానికి గల కారణం మనం ఇతరులకు దీవెనకరంగా ఉండుటకే. ఆయనను ఎరుగని ప్రజలకు సువార్త ప్రకటించుట మన మీద ఉన్న బాధ్యత. మనం పొందుకున్న సంతోషాన్ని ఆనందాన్ని సువార్తగా ప్రకటిద్దామా, రండి సువార్త ప్రకటిద్దాం ప్రతి ఒక్కరిని పరలోక ప్రజలుగా మారుద్దాం.
- శ్రమతి. శక్తి శంకర్ రాజ్ గారు
ప్రార్థన అంశం:-
ఫీల్డ్ లో ఒక గంట పని చేసే మిషనరీలు లేచేటట్లు ప్రార్థిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
www.vmm.org.in
ఈమెయిల్: info@vmm.org.in
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250