Village Missionary Movement

கிராம மிஷனரி இயக்கம்


దిన ధ్యానము(Telugu) 03.02.2021

దిన ధ్యానము(Telugu) 03.02.2021

శిష్యునికి ఏది అవసరం.

"...ఆమె సత్‌ క్రియలను ధర్మకార్యములను బహుగా చేసియుండెను" - అపో.కార్యములు 9: 36

క్రైస్తవ యవ్వనస్తులు ముగ్గురు పడవలో ప్రయాణం చేస్తున్నారు. ముగ్గురు మధ్య ఒక వాదన ప్రారంభం అయింది. మనం దేవునికి లోబడి నడిస్తే చాలు ఇతరులకు  సహాయం చేయాల్సిన అవసరం లేదు అన్నాడు ఒకడు. మనము దేవుని భక్తి గలవారుగా  మాత్రం జీవిస్తే చాలు అన్నాడు మరియొకడు. కాని మరియొక యవ్వనస్తుడైతే దేవుని పైన భక్తి కంటే ఇతరులకు సహాయం చేయుట ప్రాముఖ్యం అని అన్నాడు. ఆ ముగ్గురు అలా ఒకరినొకరు వాదించు కొంటున్నారు. దానిని వింటూ పడవ నడిపిస్తున్న అతను తన రెండు చేతుల్లో ఉంటున్న రెండు తెడ్డులలో ఒక దానిని పడవలో పడేసి ఒక దానితో పడవ నడిపిస్తున్నారు. పడవ ఎంత మాత్రం ముందుకు వెళ్ళలేదు. దానిని గమనించిన ఒకరు అయ్యా రెండు తెడ్డులతో నడిపిస్తేనే పడవ ముందుకు వెళ్తుంది అప్పుడే తొందరగా మనం గమ్యానికి చేరుకోగలం అన్నాడు. వెంటనే ఆ నావ నడిపే అతను తమ్ముళ్ళారా ! ఇలాగే క్రైస్తవుడిగా ఆయన శిష్యుల వలె జీవించాలి అంటే దేవుని పైన భక్తి అలానే సత్ క్రియ కూడా అవసరము అన్నాడు.

బైబిల్లో కూడా తబితా అనే స్త్రీ దేవుని యందు భయభక్తులు కలిగిన శిష్యురాలని చూస్తున్నాం. అందరూ చెప్పిన  సాక్ష్యం ఏమిటి అంటే ఆమె అనేకమైన సత్ క్రియలు చేయడంతోపాటు దేవుని గూర్చిన సువార్త ప్రకటించేది. తబితా మరణిచినప్పుడు ఆమె ద్వారా సత్ కార్యములు పొందుకున్నవారు వచ్చి ఆమె దగ్గర నిలువబడి పేతురును పిలిపించారు. పేతురు వచ్చి ప్రార్ధించి తబితా లెమ్ము అనిన వెంటనే తబితా ప్రాణం పొందుకుంది. దాని వలన అనేక మంది దేవుని పైన విశ్వాసము ఉంచారు. 

ప్రియమైన వారలారా!  శిష్యులగా జీవిస్తున్న మన మధ్యలో దేవుని భక్తి ఎంత అవసరమో అలాగే సత్ క్రియలు చేయడం కూడా అంతే అవసరం. ప్రతి క్రైస్తవునికి దేవుని భక్తి , సత్ క్రియ ఈ రెండు నాణెమునకు ఇరువైపులా ఉన్న రెండు బొమ్మల వంటివి. సత్ క్రియల ద్వారానే దేవుని ప్రేమను ఇతరులకు వ్యక్త పరచగలము. ఆలాగు ఉండి తబితా ప్రాణం పొందుకున్నట్లు మనము కూడా మరణిస్తూ ఉన్నట్టు ఉన్న మన జీవితంలో జీవం పొందుకొని మన జీవితం ద్వారా అనేక మంది విశ్వాసంలోనికి  రావడానికి కారకులు అవుదాం. మనం యేసయ్యను వెంబడించే నిజమైన శిష్యులైతే మనం యేసయ్యను వెంబడిస్తాం. సత్ క్రియలు చేసి మనము యేసయ్యను లోకమునకు వ్యక్తపరుస్తాం. 
-    శ్రీమతి. జాస్మిన్ శామ్యూల్


ప్రార్థన అంశం:-  7000 మంది మిషనరీల ద్వారా  లక్ష గ్రామాలను దర్శించుటకు సమర్పించ బడిన మిషనరీలు దొరికేటట్లు ప్రార్థిద్దాం.

ఈ దిన ధ్యానవాక్యం కొరకు ఈ క్రింద నoబర్లును సంప్రదించండి
వాట్సాప్ తమిళ్ కొరకు +91 94440 11864, 
ఇంగ్లీష్ కొరకు +91 86109 84002, 
హిందీ కొరకు +91 93858 10496
తెలుగు +91 94424 93250

ఈమెయిల్: reachvmm@gmail.com
Androidapp: https://play.google.com/store/apps/details?Id=com.vmmorg.template.msmapp&showAllReviews=true

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250


Comment As:

Comment (0)